Friday, February 26, 2010

*ఆధ్యాత్మిక రంగం

శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము ,బంటుమిల్లి రోడ్ ,గుడివాడ

 శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయ చరిత్ర


                చరిత్ర ప్రసిద్ది చెందినా గుళ్ళవాడ అని పూర్వమ్ పిలువబడిన గుడివాడ పట్టణం .ఈ పట్నం లో వెం చేసి యున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ యిభావము షుమారు ఒకటిన్నార శతాబ్దాల నాటిది . 18 వ శతాబ్దం లో శ్రీ తుమ్మలపల్లి భ్రమర రాజు గారిచే సంకల్పించాబడి, వారి స్వంత స్థలంలో కుమారుడి కామేశ్వర పాక యాజీ గారు సహకరిమ్చాగా ఉభయులు గోతులు పూడ్చి ఆలయ నిర్మాణంలో శ్రమదానం చేసి, స్వంత దానం వెచ్చించి నిర్మాణం పూర్తీ చేసి,ధూపదీప నైవేద్యములకు భూమిని కూడా సమర్పించినారు. మరల 1900  సం.లో శ్రీ తుమ్మలపల్లి కామేశ్వర పాక యజి గారు పునఃప్రతిష్ఠ గావించిరి. గతంలో ప్రతిష్టించిన పెచ్చు వుదిపోగా శ్రీ పాకయాజి గారి కుమారుడు కుటుంబరావు గారు శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వాముల వారు,కాశి వాస్తవ్యులు ఆశీస్సులతో కాశి పట్టణం నుండి స్వామి కుడి చేతిలో సంజీవిని పర్వతము గల ,ప్రస్తతం పూజలందు కొనుచున్న పాలరాయి విగ్రహము రావించి శ్రీ స్వాముల వారి కరకమలము లచే శ్రీ స్వామివారిని ప్రతిష్టించినారు. 
               శ్రీ స్వామి వారు అత్యంత మహిమాన్వితులు ,దేవాలయమున పూజలు,మ్రొక్కు బదులు ,ప్రదక్షిణాలు,పారాయ ణములు చేసిన భక్తులు సత్ఫలితములు పొందినారు . పుత్రార్ధులు ,పీడపరిహర నార్థులు విద్యార్థులు ,ఆరోగ్యము కొరకు మండలం లేదా అర్థ మండలం పటు శ్రీ స్వామి వార్కి 108  ప్రదక్షిణాలు చేసి కృపకు పాత్రులైరి. పూర్వము ఆలయము లో నిదురించిన భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారు ఆలయములో తాటి చెట్టు ప్రమానమున సంచరించుట దర్శించి భీతి నామదిన వారై తదుపరి స్వామిని భక్తీ ప్రపత్తులతో ప్రార్థించి తరించిరి. భక్తుల కొంగు బంగారము, కోర్కెల నిచ్చు పరమ పావని ఈ మారుతి,
దర్శించండి 
తరించండి 
పూజించి కృపకు పాత్రులు కండి








ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

No comments:

Post a Comment